ఏపీ ఉచిత ఇసుక విధానం 2024: పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 జూలై 8 నుండి కొత్త ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం కింద ఇసుకపై ఎటువంటి చార్జీలు ఉండవు, ఇది పాత విధానంలో ఉన్న చార్జీలను రద్దు చేస్తుంది.
ఉచిత ఇసుక విధాన ప్రధానాంశాలు
ఉచిత ఇసుక పొందడం
నమోదు: సమీపంలోని ఇసుక డిపోకి వెళ్లి, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, చిరునామా, వాహన నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.
ఆన్లైన్ చెల్లింపులు: అధికారుల నిర్దేశిత లోడింగ్ మరియు ట్రాన్స్పోర్ట్ ఫీజులను కేవలం ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. దీని కోసం డిపోలో QR కోడ్లు ఏర్పాటు చేశారు.
పనివేళలు: ఇసుక డిపోలు ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పనిచేస్తాయి.
మొదటి ప్రాధాన్యత: స్టాక్ ఉన్నంత వరకు, ముందుగా వచ్చిన వారికి ఇసుక అందజేస్తారు.
వెబ్సైట్ సమాచారం: ఇసుక డిపో యొక్క స్థానం మరియు స్టాక్ అందుబాటులో ఉందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను చూడండి.
ఆర్థిక వివరాలు
ఇసుక ఉచితమైనప్పటికీ, క్రింది చార్జీలు వర్తిస్తాయి:
- తవ్వకం ఫీజు: టన్నుకు ₹30
- సీనరేజ్ ఫీజు: టన్నుకు ₹88
- నిర్వహణ ఫీజు: టన్నుకు ₹20
Also Read -
Chandranna Pelli Kanuka Scheme Details 2024
AP Nirudyoga Bruthi Scheme Details
Thalliki Vandanam Scheme Details 2024
వసూలు చేసిన చార్జీల వినియోగం
- సీనరేజ్ చార్జీలు: ఈ మొత్తం ప్రభుత్వము మున్సిపల్ మరియు పంచాయితీ ఖాతాలకు చెల్లిస్తుంది.
- నిర్వహణ చార్జీలు: ఈ మొత్తం సెక్యూరిటీ మరియు వే బిల్ ఖర్చులకు వినియోగిస్తారు.
- రవాణా ఖర్చులు: వ్యక్తులు తమ రవాణా ఖర్చులను తామే భరించాలి.
- చిన్న నదులు, చెరువులు ఉన్న చోట్ల, ప్రజలు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తరలించుకోవడానికి వీలుగా చేశారు.
- ప్రతి వ్యక్తి ఒక రోజులో గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల ఇసుకను పొందవచ్చు.
- అక్రమాలు మరియు ఫిర్యాదులను నివారించడానికి, ప్రతి జిల్లాకు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు.
- ఇసుక రవాణా బాధ్యతను గ్రామ రెవెన్యూ అధికారుల (VRO), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు (VRA), మరియు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగిస్తారు.
- జిల్లా స్థాయి కలెక్టర్లు పర్యవేక్షణలో, స్పెసిఫిక్ అధికారులు ఇన్చార్జిలుగా ఉంటారు.
- లబ్ధిదారులు ఇసుక పొందడానికి తమ ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ను అందించాలి. ప్రజల నుండి వసూలు చేసిన మొత్తాలను తాత్కాలికంగా కలెక్టర్ స్థాయి సంయుక్త ఖాతాలలో జమ చేస్తారు.